దీదీ ట్రంప్‌‌లా నటించకండి

దీదీ ట్రంప్‌‌లా నటించకండి

కోల్ కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ విమర్శలకు దిగారు. దీదీ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ లా నటిస్తున్నారని కామెంట్ చేశారు. దీదీ తన ఓటమిని ముందే గ్రహించారని, అందుకే ట్రంప్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఓటమిని జీర్ణించుకోవడం కష్టమని, కానీ భవిష్యత్ ను ఆమె అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఓటమి భయంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన మమత.. అక్కడ రెండు గంటలు ఉన్నారని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీదీ చర్యలతో బీజేపీ విజయం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.