హైదారాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫాస్ట్ ఫుడ్ అడిగితే లేదన్నాడని కత్తితో పొడిచిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తూ.. సంవత్సరం క్రితం నుండి బిద్యాధర్( 32) అనే వ్యక్తి సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. అతని పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ డబ్బా నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో యాసిన్.. బిద్యాధర్ వద్దకు వచ్చి తనకు ఫాస్ట్ ఫుడ్ కావాల్సిందిగా అడిగాడు. అయితే రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని అన్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యాసిన్.. 10 నిమిషాల తరువాత కత్తితో వచ్చి బిద్యాధర్ మెడ, ఛాతిపై పొడిచాడు. దీంో తీవ్ర గాయాలైన బిద్యాధర్ ని స్దానికులు శాపూర్ నగర్ లోని మెడ్ విజన్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పియస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలోనే యాసిన్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పల్లెకు వెళ్లిన పట్నం.. బోసిపోయిన నగరం
కొవిడ్ ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు