అదనపు కట్నం కోసం వేధింపులు.. ఆత్మహత్య

అదనపు కట్నం కోసం వేధింపులు.. ఆత్మహత్య

కుషాయిగూడ, వెలుగు: అత్తింటి వేధింపులతో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. యాదాద్రి భువనగిరి కి చెందిన అంబోజు ఉపేందర్ కు అదే జిల్లాకు చెందిన లావ ణ్య (26)తో  2017 లో పెండ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు.  దంపతులు కాప్రా పరిధి సైనిక్ పురిలోని ఈశ్వరపురి కాలనీకి వచ్చి ఉంటున్నారు. అదనపు కట్నం తేవాలంటూ, లేదంటే భర్తకు రెండో పెళ్లి చేస్తామని ఆమెను అత్తింటోళ్లు కొన్నేండ్లుగా వేధిస్తున్నారు. భరించలేక లావణ్య ఆదివారం చీరతో ఉరేసుకుంది. స్థానికులు పోలీసులకు, లావణ్య తండ్రి నర్సయ్యకు సమాచారం అందించారు.  మృతురాలి తండ్రి వచ్చి భర్త, అత్తింటి వేధింపులతోనే తన కుమార్తె సూసైడ్​ చేసుకుందని కంప్లయింట్ ​చేయగా  కేసు ఫైల్​ చేశామని కుషాయిగూడ ఇన్ స్పెక్టర్ ​మన్మోహన్ తెలిపారు.