వికారాబాద్ వెలుగు : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ సమర్థనం ట్రస్ట్ హైదరాబాద్ ’ సహకారంతో ఈ నెల 18 న ఉదయం 10 గంటలకు సిల్వర్ డ్రాప్ ఫంక్షన్ హాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్, ప్యారడైజ్, ఎస్డీ రోడ్ సికింద్రాబాద్ లో దివ్యాంగులకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి లలితకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో 20 ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటాయన్నారు.
వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులు 18 నుంచి 30 ఏండ్లు ఉండి పదో తరగతి పాస్, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులని తెలిపారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో పైన తెలిపిన చిరునామాకు హాజరుకావాలని ఆమె సూచించారు. ఆసక్తి కలిగిన దివ్యాంగులు వివరాలకు సుభాశ్చంద్ర (6364867803), సతీశ్(9480835956), శ్రీనివాస్ (6364867800) నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.