దివ్యాంగులకు మెగా జాబ్​ మేళా

దివ్యాంగులకు మెగా జాబ్​ మేళా

వికారాబాద్​ వెలుగు : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ సమర్థనం ట్రస్ట్  హైదరాబాద్ ’ సహకారంతో ఈ నెల 18 న ఉదయం 10 గంటలకు సిల్వర్ డ్రాప్ ఫంక్షన్ హాల్,  స్వప్నలోక్ కాంప్లెక్స్, ప్యారడైజ్, ఎస్​డీ రోడ్ సికింద్రాబాద్ లో  దివ్యాంగులకు  మెగా జాబ్ మేళాను   నిర్వహిస్తున్నట్టు  వికారాబాద్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి లలితకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్​ మేళాలో  20 ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 

వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులు 18  నుంచి 30 ఏండ్లు ఉండి   పదో తరగతి పాస్​, డిగ్రీ,  పీజీ చేసిన వారు అర్హులని తెలిపారు.  తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్​,   జిరాక్స్ కాపీలతో పైన తెలిపిన చిరునామాకు హాజరుకావాలని  ఆమె సూచించారు. ఆసక్తి కలిగిన దివ్యాంగులు  వివరాలకు సుభాశ్​చంద్ర (6364867803), సతీశ్(9480835956), శ్రీనివాస్ (6364867800) నంబర్లలో  సంప్రదించాలని తెలిపారు.