కేసీఆర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా విమర్శలు

కేసీఆర్ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా విమర్శలు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి నోరు జారారు. దేశంలో రైతులు 130 రోజులుగా ఉద్యమం చేస్తున్నా....ప్రధాని మోడీ, కేసీఆర్ పట్టుంచుకోలేదంటూ కామెంట్ చేశారు ధర్మారెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూరులో రైతు వేదికను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. రైతాంగం ఇబ్బందులు పడుతుంటే వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రైతులు రోడ్డుపై పడుతున్నా వారిని పిలిచి మాట్లాడకుండా...ఏదో వారికి మేలు చేసినట్టు మాట్లాడడం సరికాదన్నారు.