మోడీకి ఆల్టర్నేటివ్ సీఎం కేసీఆరే

మోడీకి ఆల్టర్నేటివ్ సీఎం కేసీఆరే

మోడీకి ఆల్టర్నేటివ్ సీఎం కేసీఆరే అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ లో కేసీఆర్ ధర్నా చేస్తే ఢిల్లీలో దడ పుట్టిందన్నారు. రైతులకు మోడీ క్షమాపణ చెప్పడానికి కారణం కేసీఆరేనన్నారు. యాసంగి వరి పంట కొంటారా లేదా బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
బీజేపీని ఓడించే శక్తి కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. చైనా, పాకిస్తాన్ అంశాలే బీజేపీ అస్త్రాలని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దొంగే దొంగ అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉందన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.ఎర్ర జొన్న రైతులపై కాల్పులు జరిపిన కాంగ్రెస్ ఖతమై పోయిందన్నారు. హుజురాబాద్ లో బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు.