యాదాద్రికి 2 కిలోల బంగారం విరాళం ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

యాదాద్రికి 2 కిలోల బంగారం విరాళం ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి 2 కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు..నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ప్రధాన ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి బంగారాన్ని సమర్పించారు. విరాళం ఇవ్వడం ద్వారా తన 22 ఏళ్ల మొక్కు నెరవేరిందన్నారు ఎమ్మెల్యే. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.