పోడు రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోము

పోడు రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోము

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపెల్లి గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మూడు రోజుల నుంచి ఆటవీశాఖ అధికారుల తీరుతో ఇబ్బందిపడుతున్న పోడు రైతుల దగ్గరికి వెళ్ళి.. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. రైతులకు అన్నం తినిపించారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూములు జోలికి వస్తే బాగుండదంటూ హెచ్చరించారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తమ విధానం మార్చుకోవాలని కోరారు. తన నియోజకవర్గంలో పోడు రైతులను ఇబ్బందిపెడితే ఊరుకోనన్నారు.
 
గతంలో కూడా మహబూబాబాద్ ఏరియాలో పోడు భూముల గొడవ జరిగింది. అప్పుడు కూడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇలానే మాట్లాడారు. అటవీశాఖ అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. కానీ సమస్య పరిష్కరించమని మాత్రం ప్రభుత్వాన్ని కోరడం లేదు. ఎప్పుడు మాట్లాడినా అటవీశాఖ అధికారుల తీరునే తప్పుబడుతున్నారు. ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తుందని కానీ.. సర్కార్ పోడు రైతులకు న్యాయం చేయాలని కానీ మాట్లాడటం లేదు అధికార పార్టీ నేతలు.