ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లేకుంటే లోన్లు ఇస్తలేరు
గతంలో బ్యాంకర్ లేకుండానే మార్టిగేజ్
తాజాగా ధరణిలో ఓనర్తో పాటు బ్యాంకర్ థంబ్ మస్ట్
బ్యాంకర్లకు, కొనుగోలు దారులకు తప్పని తిప్పలు
సూర్యాపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై వెనక్కితగ్గడంతో రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, ధరణి పోర్టల్లో కొత్తగా తెచ్చిన ఆప్షన్ మార్టిగేజ్లోన్స్కు సమస్యగా మారింది. గతంలో బ్యాంకులు ఇచ్చే మెమోరాండం ఆఫ్ టైటిల్ డీడ్ తీసుకెళ్తే ప్లాట్నుగానీ, ఇల్లును గానీ మార్టిగేజ్ చేసేవారు. కానీ తాజాగా ధరణి పోర్టల్ లో యజమాని తో పాటు బ్యాంక్ మేనేజర్ ఫింగర్ ప్రింట్ వేయాల్సి వస్తుండడంతో ఒక్కో మార్టిగేజ్కు రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజంతా పడుతోంది. దీంతో తాము వర్కింగ్ అవర్స్నష్టపోతున్నామని భావిస్తున్న బ్యాంకర్లు మార్టిగేజ్ లోన్లకు నిరాకరిస్తున్నారు. దీంతో భూములు, ఇండ్లు కొనుగోలు చేయాలనుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది.
ధరణితో ఇబ్బందులు..
గతంలో సైట్డాక్యుమెంట్స్బ్యాంకుకు తీసుకెళ్తే.. చెక్చేసి, లోన్కు అన్ని విధాలా ఎలిజిబిలిటీ ఉందనుకున్నప్పడు బ్యాంకర్లు మెమోరాండం ఆఫ్ టైటిల్ డీడ్ ఇష్యూ చేసేవారు. దానిని సబ్రిజిస్ట్రార్ ఆఫీసుకు తీసుకెళ్లి ప్రాపర్టీ వాల్యూలో 0.6శాతం టాక్స్ చెల్లిస్తే బ్యాంక్ పేరు మీద మార్టిగేజ్ చేసేవారు. ఈసీలో బ్యాంక్పేరు నమోదయ్యాక ఆ డాక్యుమెంట్స్ను బ్యాంకులో సబ్మిట్ చేస్తే మేనేజర్లు లోన్ సాంక్షన్ చేసేవారు. లోన్ పీరియడ్ పూర్తయ్యాకే ప్రాపర్టీ ఓనర్కు ట్రాన్స్ఫర్ చేసేవారు. ఏ దశలోనూ బ్యాంకర్లు, రిజిస్ట్రేషన్ఆఫీసుకు వచ్చేవారు కాదు. కానీ కొత్తగా తెచ్చిన ధరణి పోర్టల్ నిబంధనల ప్రకారం ప్రాపర్టీ మార్ట్గేజ్ కోసం కొనుగోలుదారుడితో పాటు బ్యాంకర్లు కూడా రావాల్సి వస్తోంది. సర్వర్ ప్రాబ్లమ్ కారణగా ఒక్కో రిజిస్ట్రేషన్ కు రోజంతా పడుతోందని, తమ వర్క్టైం మొత్తం పోతోందని బ్యాంకర్లు అంటున్నారు. దీంతో మార్టిగేజ్లోన్స్పై ఇంట్రెస్ట్ చూపక అప్లికేషన్లన్నీ పెండింగ్పడుతున్నాయి.
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఉండాల్సిందే..
ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లేకపోతే మాత్రం బ్యాంకులు లోన్లు ఇస్తలేవు. దీంతో స్టేట్వైడ్ మార్టిగేజ్లోన్స్కోసం పెట్టుకున్న వేలాది అప్లికేషన్లు పెండింగ్లో పడ్డాయి. ఉదాహరణకు ఒక్క సూర్యాపేట జిల్లాలో సుమారు 460కి పైగా లోన్ అప్లికేషన్లు బ్యాంకర్ల వద్ద పేరుకపోయాయి. దీంతో ప్రభుత్వ తీరుపై సామాన్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియని పలువురు బయట మిత్తికి తెచ్చి భూములు, ఇండ్లు కొంటున్నారు. కరోనా ఎఫెక్ట్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2020 – 21 ఫైనాన్షియల్ ఇయర్ లో రూ. 107.36కోట్ల హౌసింగ్లోన్స్ టార్గెట్ కు గాను సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కేవలం రూ. 52.16 కోట్లు మాత్రమే సాంక్షన్ చేశారు.
లోన్ ఇవ్వట్లేదు.
ఇల్లు కొందామని బ్యాంక్ లో లోన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లోన్ సాంక్షన్ చేస్తలేరు. మార్టిగేజ్ చేసే టైంలో లేట్ అవుతుందని బ్యాంకర్లు సాకు చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక బయట వడ్డీకి అప్పు తెచ్చుకొని ఇల్లు కొనుక్కున్నాం.
–రవి, సూర్యాపేట
ఇబ్బందులు పడుతున్నం
మార్టిగేజ్ కోసం ప్రాపర్టీ కొనుగోలుదారులతో పాటు బ్యాంకర్లు రిజిస్ట్రేషన్కు ఆఫీసుకు వచ్చి థంబ్ వేయాలనే నిబంధన కష్టంగా ఉంది. సర్వర్ ప్రాబ్లమ్తో రోజంతా రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే గడుస్తోంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ కింద లోన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఈ టైంలో బ్యాంక్ ను వదిలి రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరం. బ్యాంకుల్లో పనులన్నీ పెండింగ్ పడుతున్నాయి.
–రమేశ్, బ్యాంక్ మేనేజర్, సూర్యాపేట