రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు లొంగిపోయాడు

రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు లొంగిపోయాడు

టీఆర్ఎస్ ,కాంగ్రెస్ రాజకీయంగా ఒక అవగాహనకు వస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయిందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు బోర్డు కంటే మెరుగైన ఎక్ట్సెన్షన్ బోర్డు ఏర్పాటు చేశామని పార్లమెంట్ లో కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు. ఉత్తమ్ కేసీఆర్ కు బ్రోకర్ గా మారారన్నారు.  రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏశారని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నా ఉత్తమ్ కుమార్ ఏం చేశాడని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు లొంగిపోయాడన్నారు.