నీట్ లో మృణాళ్ కు ఫస్ట్ ర్యాంక్

నీట్ లో మృణాళ్ కు ఫస్ట్ ర్యాంక్

హైదరాబాద్‌ ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌ చెందిన స్టూడెంట్ మృణాళ్‌..  నీట్‌ యూజీ 2021 పరీక్షలో 720 మార్కులు స్కోర్ చేసి ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 1 సాధించాడు. డాక్టర్ గా సమాజానికి సేవ చేసేందుకు.. మెడిసిన్ మంచి అవకాశమని నిర్ణయించుకున్నట్లు మృణాల్ తెలిపాడు. మృణాల్ తండ్రి హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌, తల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.

అద్భుత  విజయం సాధించినందుకు మృణాల్‌ను  అభినందిస్తున్నామన్నారు ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఆకాశ్‌ చౌదరి. ఉన్నత విద్యలో మరింత రాణించి మెడిసిస్‌లో కెరీర్‌ సాగించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

ఆకాశ్‌లో రాసిన మాక్‌ టెస్టులు.. నీట్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌ రాసేందుకు తనలో తగిన విశ్వాసాన్ని పెంచాయన్నాడు మృణాళ్.