రాళ్లను ఢీకొని పల్టీ కొట్టిన కారు.. ఒకరి మృతి

రాళ్లను ఢీకొని పల్టీ కొట్టిన కారు.. ఒకరి మృతి

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న( ఆదివారం) అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకరు మృతి చెందగా .. మరో ముగ్గురు గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం ఫ్రెండ్స్ షిప్ డే సందర్భంగా నలుగురు మిత్రులు డిన్నర్ కు  ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా అభిషేక్ ,సత్య ప్రకాష్, తరుణీ, ఆశ్రిత కొండాపూర్ లోని స్నోర్ట్ పబ్ కి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత నలుగురు తమ స్కోడా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కొండాపూర్ మై హోమ్ మంగళ దగ్గర కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీకొని పల్టీ కొట్టింది.దీంతో వెనక సీటు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత కారులోంచి కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంలో అక్కడికక్కడే చనిపోయింది. 

కేసు నమోదు చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతున్నట్టు..కారు నడిపిన వ్యక్తి అభిషేక్ అని పోలీసులు తెలిపారు. మద్యం మత్తుతో పాటు మితిమీరిన వేగంతో కారు నడపడం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చేనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.