దళితబంధు జమ అయినట్టు  పాస్​బుక్​ లిచ్చిన్రు

దళితబంధు జమ అయినట్టు  పాస్​బుక్​ లిచ్చిన్రు

జమ్మికుంట, వెలుగు: హుజూరాబాద్​నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు ఖాతాలో డబ్బులు జమ చేసినట్లుగా పేర్కొంటూ పాస్​బుక్​లు అందజేస్తున్నారు. కరీంనగర్​జిల్లా జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో దళితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.  9,90,000 జమైనట్లుగా కొత్త పాస్​బుక్​లో నమోదు చేసి లబ్ధిదారులకు అందజేశారు. దళితబంధు లబ్ధిదారులందరికీ నాలుగైదు రోజుల్లో పాస్​బుక్​లు అందజేస్తామని మున్సిపల్​ కమిషనర్​ సుమన్​రావు, బ్యాంక్ అధికారులు చెప్పారు.