వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ బాహుబలి

వ్యాక్సిన్  తీసుకున్న ప్రతి ఒక్కరూ బాహుబలి

వ్యాక్సిన్ తీసుకుంటే ప్రతి ఒక్కరూ బాహుబలి అవుతారన్నారు ప్రధాని మోడీ. కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాటంలో ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకుని బాహుబలి అయ్యారన్నారు.  ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అందరు వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మోడి. ప్రతి ఒక్కరూ కరోనా ప్రోటోకాల్స్ పాటించాలన్నారు. వర్షాకాల సమావేశాల కోసం పార్లమెంట్ కు వచ్చారు మోడీ. సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కోరుకున్న ప్రతి దానికి జవాబిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నలైనా అడగొచ్చన్నారు మోడీ.