ఉత్తం పై పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు

ఉత్తం పై పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఘోర పరాజయం ఫై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తంకుమార్‌రెడ్డి పై ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 అంతేకాదు..ఉత్తంకుమార్‌రెడ్డి కజిన్ సోదరుడు  కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్రంగా విమర్శించారు. ఇలాగే కొనసాగితే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్‌ విసిరారు.