హైదరాబాద్‌లో మరో మూడురోజులు వర్షాలు

హైదరాబాద్‌లో మరో మూడురోజులు వర్షాలు

హైదరాబాద్,వెలుగు:  సిటీలో మరో మూడ్రోజులు మేఘాలు కమ్ముకొని ముసురు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ​వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సిటీలోనూ నాలుగు రోజులుగా మేఘాలు కమ్మేసి ముసురు పడుతుంది. ఆదివారం కూకట్​పల్లిలో 0.95, ఖైరతాబాద్​లో 0.80, కాప్రాలో0.78, నాంపల్లి 0.58 సెంటిమీటర్ల చొప్పున జల్లులు పడ్డాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. కొన్ని ఏరియాల్లో రోడ్లపై నీరు నిలిచిపోగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణం చల్లగా ఉండగా స్వెటర్లు లేకుండా జనం బయటకు రాలేదు మరోవైపు భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్-నాందేడ్ మధ్య రైళ్లు రద్దు అయ్యాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య నడిచే రెండు రైళ్లను అధికారులు ఇవాళ రద్దు చేసినట్లు ప్రకటించారు.