అందరికీ  ఆరోగ్య బీమా.. దేశంలోనే తొలిసారి అమలు

అందరికీ  ఆరోగ్య బీమా.. దేశంలోనే తొలిసారి అమలు

జైపూర్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల విలువైన క్యాష్​లెస్​ ‘మెడిక్లైమ్’ పథకాన్ని రాజస్థాన్ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ఈ ఏడాదిలో ఆరోగ్య బీమా పథకం ప్రారంభిస్తున్నామని బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఈమేరకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్న మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ‘హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను ఇవ్వాల్టినుంచే ప్రారంభిస్తున్నాం. ప్రజలందరికీ మెడికల్ రిలీఫ్ కల్పించే లక్ష్యంతో ఈ పథకం మొదలెట్టాం’ అని సీఏం ట్వీట్ చేశారు.