
జాతీయ పక్షి ఏంటి? ఇంకేంటి.. నెమలే కదా. వాటి సంఖ్య భారీగా పెరిగిందట. అవును, డ్యాన్స్లో పక్షులకు కేరాఫ్ అడ్రస్గా ఉండే నెమళ్లు దేశంలో ఎక్కువైనయట. అక్కడితో ఆహా..ఓహో అనుకోవడానికి లేదు. ఎందుకంటే నెమళ్లు పెరిగినా మొత్తంగా పక్షుల సంఖ్య దేశంలో భారీగా పడిపోయిందట. పడిపోతోందట. అవును, ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ 2020 రిపోర్టు విషయాలు చెప్పింది. గుజరాత్లో కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసిస్పై జరుగుతున్న 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఎంఎస్ సీవోపీ 13) సదస్సు సందర్భంగా ఈ రిపోర్టును విడుదల చేశారు. మొత్తం 867 జాతుల పక్షులపై స్టడీ చేశారు. 15,500 మంది పక్షి సంరక్షకులు చేసిన పది లక్షలకు పైగా అబ్జర్వేషన్లలో తేలిన విషయాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఈ తాజా రిపోర్టును విడుదల చేశారు. రెండు విభాగాలుగా పక్షుల మనుగడను అంచనా వేశారు. లాంగ్ టర్మ్ (25 ఏళ్లలో పక్షుల సంఖ్య), కరెంట్ ట్రెండ్స్ (గత ఐదేళ్ల నుంచి పక్షుల సంఖ్య)తో పక్షుల లెక్క తీశారు. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సలీమ్ అలీ సెంటర్ ఫర్ ఓర్నిథాలజీ అండ్నేచురల్ హిస్టరీ, వెట్ల్యాండ్స్ ఇంటర్నేషనల్ సౌత్ఏషియా సహా 10 సంస్థలు కలిసి ఈ రిపోర్టును తయారు చేశాయి.
79 శాతం పోయినయ్
కరెంట్ ట్రెండ్స్లో చూస్తే మొత్తం పక్షుల్లో 79 శాతం పక్షులు అంతరించిపోయాయని రిపోర్టు పేర్కొంది. లాంగ్టర్మ్లో చూస్తే 50 శాతం పక్షులు పోయాయని తెలిపింది. మొత్తంగా 101 జాతుల పక్షుల ‘మనుగడ’ పెద్ద ప్రమాదంలో పడిందని చెప్పింది. కరెంట్ ట్రెండ్స్లో 146 జాతుల పక్షుల మనుగడపై అంచనా వేస్తే అందులో 80 శాతం పక్షులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని, 50 శాతం పక్షుల అంతర్ధానం మరింత స్ట్రాంగ్గా ఉందని పేర్కొంది. లాంగ్టర్మ్కు సంబంధించి 261 జాతుల పక్షుల వివరాలు సమగ్రంగా ఉన్నాయని రిపోర్టు చెప్పింది. అందులో 2000వ సంవత్సరం నుంచి 52 శాతం పక్షులు తగ్గిపోయాయని చెప్పింది.
నెమళ్లతో పంటలు పోతున్నయ్
జాతీయ పక్షి నెమళ్ల విషయంలో మాత్రం ట్రెండ్స్ రివర్స్గా ఉన్నాయి. వేరే పక్షులు తగ్గిపోతున్నా, నెమళ్లు మాత్రం అటు లాంగ్టర్మ్, ఇటు కరెంట్ ట్రెండ్స్లో భారీగా పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో అవి పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో నెమళ్లను కాపాడుతూనే పంటలకూ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని రిపోర్ట్ సూచించింది.
గద్దలు, రాబందులకు కష్టాలే
గద్దలు, రాబందులు, వార్బ్లర్స్(జిట్ట పక్షి, కోకిలలా పాడేది), వలస వచ్చే కొంగ జాతి పక్షులకు మాత్రం పెనుముప్పు ఎదురవుతోందని రిపోర్ట్ హెచ్చరించింది. వాటి సంఖ్య భారీగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు, దేశం లోలోపలే వలస వెళ్లే పక్షులూ భారీగా పడిపోతున్నాయని పేర్కొంది. 1990 నుంచి రాబందులు, బస్టర్డ్లు ఎక్కువగా కనుమరుగవుతున్నాయని చెప్పింది. అంతరించిపోయే జాతుల్లో చేర్చిన గ్రీన్ మ్యూనియా, జెర్డన్ కోర్సర్ అనే పక్షులూ కనిపించకుండా పోతున్నాయట. 1986 నుంచి జెర్డన్ కోర్సర్ అనే పక్షి ఆనవాళ్లే కనిపించలేదట. ఇప్పటికే అంతరించిపోయాయనుకున్న అడవి జాతి గుడ్లగూబలు 1997లో కనిపించాయని, అయితే, వాటి సంఖ్య కూడా బాగా తక్కువగా ఉందని రిపోర్ట్ పేర్కొంది.
రోజూ 60
ఓ దేశీ ఆవు మామూలుగా అయితే రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తుంది? మహా అయితే రోజుకు పది లీటర్లు. కానీ, రోజుకు ఓ ఆవు 60 లీటర్ల పాలిస్తే.. పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచేస్తే..? అవును, నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) మూడు రోజుల పాటు నిర్వహించిన నేషనల్ డెయిరీ మేళాలో ఓ ఆవు ఆ ఘనత సాధించింది. 58.86 లీటర్ల పాలిచ్చి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. అందంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. హర్యానాలోని కర్నాల్ జిల్లా దాదూపూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే రైతుకు చెందిన హెచ్ఎఫ్ క్రాస్బ్రీడ్ ఆవు ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ హెచ్ఎఫ్ జాబితాలో బరణి ఖల్సాకు చెందిన విజేందర్ చౌహాన్ అనే రైతుకు చెందిన మరో ఆవు 58.17 లీటర్ల పాలిచ్చి రెండో ప్రైజును సొంతం చేసుకుంది. ఇతర క్రాస్బ్రీడ్ జాతుల ఆవులకు సంబంధించిన పోటీల్లో అంబాలా రైతు జస్దీప్ సింగ్కు చెందిన ఆవు 26.97 లీటర్ల పాలిచ్చి ఫస్ట్ ప్రైజు సొంతం చేసుకుంది. దేశీ కేటగిరీలో తరౌరీకి చెందిన రామ్సింగ్ ఆవు 21.31 లీటర్ల పాలతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. నరేశ్ అనే రైతుకు చెందిన ఆవు 15.81 లీటర్లతో రెండో స్పాట్లో నిలిచింది. ఇక, ముర్రే జాతి గేదెల పోటీల్లో అసంధ్కు చెందిన రణ్దీప్ అనే రైతుకు చెందిన గేదె 21.77 లీటర్ల పాలిచ్చింది. ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.