
హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని హోసూరులో జరిగిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటక పారిపోయేందుకు దోపిడీ దొంగలు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారంతో అలర్టయిన సైబరాబాద్ పోలీసులు దోపిడీ దొంగలను వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. వీరు పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.