హనుమకొండ: పట్టపగలే.. రద్దీ ఉండే చోటు.. అయినా దొంగలు అందరి కళ్లుగట్టి రూ. 25 లక్షలు ఎత్తుకెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే చోరీ జరిగిపోయింది. ఈ భారీ చోరీ సోమవారం హనుమకొండ నడిరోడ్డుపై జరిగింది. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద కారు అద్దాలు పగులగొట్టి 25 లక్షలను దొంగలు కొట్టేశారు. బాధితులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో డబ్బు డ్రా చేసి, కారులో పెట్టి సంతకం కోసం బ్యాంకులోకి వెళ్లి తిరిగి వచ్చారు. అనంతరం బయటికి వచ్చి చూసే సరికి కారు అద్దాలు పగులగొట్టి డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అందరు ఉన్నా.. దొంగలు తమపని దర్జాగా చేసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. కష్టపడి దాచుకున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లడంతో బాధిత ఫ్యామీలి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పట్టపగలే బ్యాంకు దగ్గర రూ. 25 లక్షలు చోరీ
- తెలంగాణం
- November 15, 2021
లేటెస్ట్
- ఎవరీ వర్షా ప్రియదర్శిని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సీఎం నవీన్ పట్నాయక్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం