పట్టపగలే బ్యాంకు దగ్గర రూ. 25 లక్షలు చోరీ

పట్టపగలే బ్యాంకు దగ్గర రూ. 25 లక్షలు చోరీ

హనుమకొండ:  పట్టపగలే.. రద్దీ ఉండే చోటు.. అయినా దొంగలు అందరి కళ్లుగట్టి రూ. 25 లక్షలు ఎత్తుకెళ్లారు. నిమిషాల వ్యవధిలోనే చోరీ జరిగిపోయింది. ఈ భారీ చోరీ సోమవారం హనుమకొండ నడిరోడ్డుపై జరిగింది. నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద కారు అద్దాలు పగులగొట్టి 25 లక్షలను దొంగలు కొట్టేశారు. బాధితులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో డబ్బు డ్రా చేసి, కారులో పెట్టి సంతకం కోసం బ్యాంకులోకి వెళ్లి తిరిగి వచ్చారు. అనంతరం బయటికి వచ్చి చూసే సరికి కారు అద్దాలు పగులగొట్టి డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అందరు ఉన్నా.. దొంగలు తమపని దర్జాగా చేసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. కష్టపడి దాచుకున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లడంతో బాధిత ఫ్యామీలి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.