హరితహారం మొక్కలను తొలగిస్తే రూ.500 ఫైన్

హరితహారం మొక్కలను తొలగిస్తే రూ.500 ఫైన్

వికారాబాద్, వెలుగు : హరితహారంలో భాగంగా రోడ్లుకు ఇరువైపులా నాటిన మొక్కలను తొలగించిన వారికి రూ.500 ఫైన్ విధించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో నర్సరీల నిర్వహణ, హరితహారం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్ అంశాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని నర్సరీల నిర్వహణ కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు.  8వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వెంటనే గుంతలు తవ్వే పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, వికారాబాద్ తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.