
హైదరాబాద్: బీజేపీ గెలిచిన 48 సీట్లు.. భాగ్యలక్ష్మి అమ్మవారి గెలుపని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యులేనన్నారు. ఉత్తమ్ విలువ ఇప్పుడు తెలియకున్నా భవిష్యత్ లో తెలుస్తుందన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తానని చెప్పారు జగ్గారెడ్డి.