
ముంబై: విషవాయువు పీల్చడంతో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం మహారాష్ట్రలోని రాయ్గడ్ లో జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని ఇండో ఎమైన్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకైంది. దీంతో ఈ విషవాయువు ప్రభావం వల్ల ఏడుగురు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఫ్లాంట్ వద్ద పోలీసులను మోహరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది