ఎమ్మెల్సీలుగా ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవం

ఎమ్మెల్యేగా కోటా ఎమ్మెల్సీలుగా.. ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ( మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.  పోటీ లేకపోవటంతో గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్, పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.