దసరా పండుగకు అత్తారింటికి వెళ్లిన ఓ అల్లుడు కన్పించకుండా పోయాడు. బయటకు వెళ్లి వస్తానని చెప్పి..ఎంతకీ రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన గెంటెల విష్ణు.. భార్య జ్యోతితో ఈ నెల 15న దోమకొండలోని తన అత్తారింటికి వెళ్లాడు.
ఈనెల 16న అత్తారింటి నుంచి బయటకు వెళ్లి వస్తాని బయటకు వెళ్లాడు విష్ణు. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో...బంధువులు, స్నేహితుల ఇళ్ల దగ్గర వెతికారు. అయినా విష్ణు ఆచూకీ తెలియలేదు. దీంతో విష్ణు భార్య జ్యోతి దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.