నేటి నుంచి గుట్టపైకి ఫ్రీ బస్సులు

నేటి నుంచి గుట్టపైకి ఫ్రీ బస్సులు

యాదాద్రి ఆలయానికి తిరుమల తరహాలో భద్రత కల్పించడానికి ఆలయ ఆఫీసర్లు పకడ్బందీగా ప్లాన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా గుట్టపైకి అన్ని రకాల ప్రైవేటు వాహనాల రాకపోకలను నిషేధించారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గుట్ట కింది నుంచి పైసా ఖర్చు లేకుండా పైకి తీసుకెళ్లడం, దర్శనం తర్వాత తిరిగి కిందికి చేర్చేలా ఏర్పాట్లు చేశారు. దీని కోసం యాదాద్రి దర్శని పేరుతో స్పెషల్​బస్సులను సిద్ధం చేశారు. శుక్రవారం నుంచే కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు ఆలయ ఈఓ గీతారెడ్డి ప్రకటించారు.