
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఫై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారంలో భాగంగా దారుసాలం కూల్చిస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.అటు పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ పై ఉన్న పీవీ , ఎన్ఠీఆర్ ఘాట్ లను కూల్చివేస్తామంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు. వీరిద్దరిపై ఐపీఎస్ 505 సెక్షన్ కింద ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.