సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్లదాడి

సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్లదాడి

పశ్చిమ బెంగాల్‌లోని సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌లో పోలింగ్ జరుగుతోన్న సమయంలో.. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై గురువారం రాళ్లదాడి జరిగింది. అయితే, ఆ దాడి నుంచి సువేందు సురక్షితంగా బయటపడ్డారు. నందిగ్రామ్‌లోని సాతేన్‌గాబరీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాళ్ల దాడిలో సువేందు కారు వెనక వస్తోన్న మీడియా వాహనం మాత్రం స్వల్పంగా ధ్వంసమైందని తెలుస్తోంది.

మరోవైపు.. పశ్చిమ మిడ్నాపూర్‌లోని కేశ్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి ప్రీతి రంజన్‌ కాన్వాయ్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో దశలో భాగంగా బెంగాల్‌లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. సువేందు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్ కూడా ఆ స్థానాల్లో ఒకటి.