అర్ధరాత్రి బార్​లో గొడవ

అర్ధరాత్రి బార్​లో గొడవ

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ పరిధిలో ఓ బార్​లో బుధవారం రాత్రి జరిగిన గొడవలో ఇరు వర్గాలు కుర్చీలు, టేబుళ్లతో దాడులు చేసుకున్నాయి.  గురువారం మేడిపల్లి ఏఎస్ఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ... బోడుప్పల్​కు చెందిన కె. ప్రదీప్  ఫ్రెండ్స్​తో కలిసి బుధవారం రాత్రి 10 గంటలకు అమృత బార్​కు వెళ్లాడు.  అదే టైమ్​లో  మల్లాపూర్​కు చెందిన జహంగీర్, మనోజ్, శ్రీకాంత్ సహా 10 మంది యువకులు పక్క టేబుల్ దగ్గర మందు తాగుతున్నారు.  ఈ క్రమంలో  రెండు గ్రూప్​ల మధ్య గొడవ జరిగింది.  కుర్చీలు, టేబుళ్లతో దాడులు చేసుకుంటూ  బార్​ నుంచి బయటకు వెళ్లి  మరింత గొడవ పడ్డారు. ప్రదీప్​ మేడిపల్లి పీఎస్​లో  కంప్లయింట్ చేయగా..  పోలీసులు కేసు ఫైల్ చేశారు.