ఫుట్ బోర్డుపై ప్రయాణం వద్దని మందలిస్తే.. రాళ్లతో దాడి

ఫుట్ బోర్డుపై ప్రయాణం వద్దని మందలిస్తే.. రాళ్లతో దాడి
  • చెన్నై నగరంలోని అన్నామలై రోడ్డు వద్ద ఘటన

చెన్నై: ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న విద్యార్థులను మందలించినందుకు చెన్నైలో కండక్టర్ కొట్టారు విద్యార్థులు. అంతేకాదు బస్సుపై రాళ్లతో దాడిచేశారు. ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించిన కండక్టర్ కు గాయాలయ్యాయి. చెన్నై నగరంలోని అన్నామలై రోడ్డులో చోటుచేసుకుందీ ఘటన. రద్దీగా ఉన్న బస్సులో 10 మంది విద్యార్థులు ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తున్నారు.
ఒకవైపు బస్సులో టికెట్లు కొడుతూనే ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న విద్యార్థులను గమనించిన కండక్టర్, డ్రైవర్ లోపలికి రావాలని పదేపదే చెప్పారు. అయినా విద్యార్థులు వినకపోవడంతో బస్సును ఆపేశారు. దీంతో విద్యార్థులు బస్సుదిగి రాళ్లతో దాడి చేశారు. సిటీ బస్సుపై విద్యార్థుల రాళ్లదాడి ఘటనతో అన్నామలై రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్ ను క్లియర్ చేసి.. విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.`