మాస్కులు వేసుకోకపోతే షాపులు మూసేస్తం

మాస్కులు వేసుకోకపోతే షాపులు మూసేస్తం

హైదరాబాద్ : కోఠి ఇందర్ బాగ్ , గుజరాతీ గల్లీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు సుల్తాన్ బజార్ పోలీసులు. మాస్క్ లు ధరించని షాప్ యజమానులకు , పాదచారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు . మరోసారి మాస్క్ లు వేసుకోకపోతే షాపులను మూసివేస్తామని యజమానులను హెచ్చరించారు సుల్తాన్ బజార్ పోలీసులు. మాస్క్ వేసుకొని వారి వివరాలు , ఫోటోలను సేకరించి మేజిస్ట్రేట్ కు సమర్పించనున్నారు పోలీసులు.

మరోవైపు రాచకొండ సీపీఆదేశాల మేరకు బాలాజీ నగర్ లోని పలు దుకాణాల్లో తనికీలు నిర్వహించారు జవహర్ నగర్ పోలీసులు....మాస్కులు ధరించని 20 మంది దుకాణదారులు పై రూ.1000 చొప్పున జరిమానాలు విధించారు జవహర్ నగర్ పోలీసులు. ఇకపై ప్రతిరోజు కోవిడ్  నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధిస్తామని తెలిపారు. అందుచేత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కలు ధరించాలని కోరారు.

https://youtu.be/38mS4eIGPY4