డబ్బులు తీసుకుందాం..ఈటలను గెలిపిద్దాం

డబ్బులు తీసుకుందాం..ఈటలను గెలిపిద్దాం

కేంద్ర హోం మంత్రి  అమిత్ షాతో భేటీ తర్వాత.. బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం..కానీ అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఇవాళ(బుధవారం) వచ్చి కలిశామన్నారు. ఈటల ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయని తెలిపారు. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా తెలంగాణకు వస్తామని అన్నారని చెప్పారు. అలాగే పాదయాత్రకు కూడా ఆయన్ను ఆహ్వానించామని.. ఆగస్టు 9న పాదయాత్ర మొదలవుతుందన్నారు.

అంతేకాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్. టీఆరెస్ పార్టీ భయపడుతోందని.. వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదన్నారు. డబ్బులు ఎంత పంచినా.. అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందాం... బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపిద్దాం అని అన్నారు. అవినీతి, అక్రమాల, అరాచక పాలనను అంతం చేయడం కోసం పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు బండి సంజయ్‌.