మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్

ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుండటంతో మత్స్యకారుల జీవనోపాధి ఎంతో మెరుగుపడిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 18ఏళ్లు నిండిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అనేక సమస్యల పరిష్కారానికి జూలై 8న గంగపుత్ర, ముదిరాజ్ సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు తలసాని. కొత్త మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోంటామన్నారు. మృతి చెందిన 116 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ చెల్లిస్తామన్నారు తలసాని.