- ఆన్లైన్, ట్యూటరింగ్ అకాడమీలకు అప్లై చేసుకునేటోళ్లు ఎక్కువైతున్నరు
- ప్రైవేట్ టీచర్ల నుంచే ఎక్కువగా అప్లికేషన్లు
- గతేడాది వందల మందిని రిక్రూట్ చేసుకున్న కంపెనీలు
- ఎక్స్పీరియన్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆధారంగా జాబ్స్ ఆఫర్
“ స్కూల్టీచింగ్ లో నాలుగేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. సోషల్ సబ్జెక్ట్ చెప్పేదాన్ని. కరోనాతో జాబ్ పోయింది. ఎడ్యుకేషన్ అంతా డిజిటల్ కి షిఫ్ట్ అవుతుండగా ఈ-లెర్నింగ్ కంపెనీలో జాబ్ కోసం ట్రై చేశా. ప్రాసెస్ లోనే ఆగిపోతుంది. సబ్జెక్ట్ నాలెజ్డ్ ఉన్నా మిగతా స్కిల్స్ కూడా తెలుసుండాలి. ఫిజికల్ గా చెప్పడం ఈజీ. కానీ లైవ్ క్లాసుల్లో కష్టం. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నా. అవకాశాలున్నా కొన్ని బేసిక్ స్కిల్స్ కూడా కావాలి. ” అని మల్కాజిగిరికి చెందిన ప్రైవేట్ టీచర్ లక్ష్మి చెప్పారు.
హైదరాబాద్, వెలుగు: స్కూల్స్ ఫిజికల్ గా రీ ఓపెన్ అయినా ఇంకా తక్కువమంది టీచర్లతోనే క్లాసులు చెప్పిస్తున్నాయి మేనేజ్మెంట్. వారికి కూడా గంటల లెక్కన, సబ్జెక్ట్ ని బట్టి శాలరీలు చెల్లిస్తున్నాయి. ఇలా జాబ్ చేస్తున్న టీచర్లలో 50 శాతం ఉండగా, కొందరు ప్రైవేట్ ట్యూటర్లుగా చేస్తుండగా, మరికొందరు ఈ–లెర్నింగ్ కంపెనీలో జాబ్ల కోసం ట్రై చేస్తున్నారు. దీంతో ఆన్లైన్ఎడ్యుకేషన్ కంపెనీలకు, ట్యూటరింగ్ అకాడమీలకు జాబ్ కావాలంటూ అప్లికేషన్లు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. ఆన్లైన్ సైట్లలో టీచర్లకు డిమాండ్ ఉన్నా క్వాలిఫికేషన్, టెక్నికల్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెజ్డ్ కంపల్సరీ ఉండాల్సి ఉండగా చాలామందికి అవకాశాలు దొరకడం లేదు. అప్లికేషన్లైతే ఎక్కువగా వస్తున్నాయని, క్వాలిఫికేషన్ కి తగినట్టుగా జాబ్లు కల్పించలేకపోతున్నామని ఈ– లెర్నింగ్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ-లెర్నింగ్, ట్యూటర్స్ అకాడమీల్లో జాబ్ల కోసం ప్రైవేట్ టీచర్ల నుంచి అప్లికేషన్లు పెరిగాయి.
ఆన్లైన్ ప్లాట్ఫామ్తో డిమాండ్
కరోనా కారణంగా 90 శాతం మంది ప్రైవేట్ టీచర్లు జాబ్లు కోల్పోయినది తెలిసిందే. ఇందులో 20, 30శాతం మంది పూర్తిగా టీచింగ్ ఫీల్డ్ వదిలేసి వేరే జాబ్లు, బిజినెస్ల వైపు వెళ్లిపోయారు. ఉన్న టీచర్లు మాత్రం టీచింగ్లోనే ఉండి ట్యూటర్లుగా మారడం, ఈ–ఎడ్యుకేషన్ కంపెనీల్లో జాయిన్ అవడం చేస్తున్నారు. ఆన్లైన్ప్లాట్ ఫామ్ కి స్టడీస్కు షిఫ్ట్ అవగా టీచర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో టీచింగ్ ట్రైనింగ్ కంపెనీల ద్వారా, డైరెక్ట్ గా కూడా ఈ– -లెర్నింగ్ కంపెనీలైన వైట్ హాట్, వేదాంతు, బైజూస్ లాంటి టీచర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. అయితే టీచర్ల అన్ని రకాల క్వాలిఫికేషన్లు, ఆన్లైన్ టీచింగ్స్కిల్స్చూసి తీసుకుంటున్నాయి.
స్కిల్స్ లేకపోతుండగా..
ఆన్లైన్లో టీచింగ్చేసేందుకు మొదట్లో టీచర్లు అప్లికేషన్లు, సెట్టింగ్స్, టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం లాంటి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ–లెర్నింగ్ సైట్లలో జాబ్ పొందాలన్నా ఇవే ప్రాబ్లమ్స్గా ఉంటున్నాయి. దీంతో కొంతమంది టీచర్లు టెక్నికల్ స్కిల్స్ పై పట్టు కోసం యూట్యూబ్ లో వీడియోలు చూడటం, ప్రాక్టికల్ గా నేర్చుకోవడం వంటివి చేస్తూ ఆ తర్వాత ఈ– లెర్నింగ్జాబ్కు ట్రై చేస్తున్నారు. ఆన్లైన్టీచింగ్బాబ్లకు సెలెక్ట్ కాని వారు తమ ప్రాంతంలోనే ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పుకుంటున్నారు. మరికొంతమంది టీచర్లు గ్రూప్ గా ఏర్పడి ఆన్లైన్లెర్నింగ్ ఇనిస్టిట్యూషన్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్క్లాసు వరకు అన్ని సబ్జెక్ట్ ల్లో ఎక్స్ పీరియన్స్ టీచర్స్ తమ బయోడేటాతో ఆన్లైన్, పేపర్స్ లో యాడ్స్ ఇస్తున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు ఇంట్రెస్ట్ చూపని పేరెంట్స్కాంటాక్ట్ అయితే వారి ఇండ్లకు వెళ్లి క్లాసులు చెబుతున్నారు. క్లాస్, సబ్జెక్ట్ వైజ్ గా ఫీజు చార్జ్ చేస్తున్నారు. ఇలా నెలకి 3 వేల నుంచి 15 వేల వరకు తీసుకుంటున్నారు.
ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక..
కరోనా తర్వాత స్కూళ్ల బంద్తో ఆన్లైన్ఎడ్యుకేషన్ కంపెనీలు అప్రోచ్ అయ్యాయి. జాబ్ మేళాలు కండెక్ట్ చేసి టీచర్లను తీసుకున్నాం. వాళ్లు స్టూడెంట్స్ కు డౌట్స్ సాల్వ్ చేయడం, క్లాసెస్ తీసుకోవడం చేస్తుంటారు. ఆన్లైన్ఎడ్యుకేషన్ కంపెనీలు టీచర్ బయోడేటా చూశాకే, యూజ్ అవుతారని కన్ఫర్మ్చేసుకున్నాకే హైర్ చేసుకుంటాయి. చాలామంది టీచర్లు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక జాబ్లు పొందలేకపోతున్నారు.
- వరుణ్, టీచర్ రీడిఫైనింగ్, ఎడ్యుకేషన్ వెబ్ సైట్
అవసరమైన సబ్జెక్ట్ టీచర్లనే రిక్రూట్..
స్కూల్స్ రీ ఓపెన్ అయినా టీచర్లను పూర్తిగా రిక్రూట్చేసుకోలేదు. ఆన్లైన్లో క్లాసులు చెప్పిన టీచర్లతో పాటు అవసరమైన సబ్జెక్ట్ టీచర్లనే అపాయింట్ చేసుకున్నారు. వారికి కూడా శాలరీలు తక్కువగానే ఇస్తున్నారు. చాలామంది టీచర్లు హోమ్ ట్యూటర్లుగా మారిపోయారు.
- శివరాజ్, ప్రైవేటు టీచర్, టీపీటీఎఫ్