ఉపాధ్యాయులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం

ఉపాధ్యాయులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం

డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా తరలివచ్చిన జాక్టో  నేతలు, టీచర్లు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఉపాధ్యాయ సంఘం నేతలను అడ్డుకున్న పోలీసులు... వారిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు.