అపార్ట్ మెంట్ లో చొరబడ్డ దొంగలు

అపార్ట్ మెంట్ లో చొరబడ్డ దొంగలు

రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం  మండలం  గుంటుపల్లిలోని  ఒక అపార్ట్ మెంట్ లో  చోరీకి ప్రయత్నించారు దొంగలు.  అయితే   వీళ్లు  చెడ్డీ గ్యాంగా .. లేక చిల్లర దొంగలా... అన్న దానిపై  క్లారిటీ రావడం  లేదు. ఐదుగురు దొంగలు  కర్రలు, రాడ్లతో  అపార్ట్ మెంట్ లోకి   చొరబడిన దృశ్యాలు  సీసీ కెమెరాల్లో  రికార్డు అయ్యాయి. అపార్ట్ మెంట్  వాసులను చూసి ..  అక్కడి నుంచి  పరారైనట్లు చెబుతున్నారు  పోలీసులు. చెడ్డీ గ్యాంగ్  చేసిన  చోరీలు చూస్తే.. అడ్డొచ్చిన  వారిని  గాయపరిచి  దొచుకెళ్లిన  ఘటనలు ఉన్నాయి.  గుంటుపల్లిలో  చోరీకి  ప్రయత్నించింది   చెడ్డీ దొంగలా..  లేక చిల్లర దొంగలా అని  విచారణ  చేస్తున్నారు పోలీసులు.