తమిళనాడులో పొలిటికల్ హీట్.. పొత్తులపై కమల్ కసరత్తులు

తమిళనాడులో పొలిటికల్ హీట్.. పొత్తులపై కమల్ కసరత్తులు

చెన్నై: తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు నేతల చేరికలు, ప్రచారాలకు పదును పెడుతూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా ఇతర పార్టీలతో పొత్తులపై సమాలోచనలు చేస్తున్నారు. తమ సిద్ధాంతాలకు సారూప్యత ఉన్న పార్టీలతో జట్టు కట్టేందుకు రెడీగా ఉన్నట్లు కమల్ తెలిపారు. ‘చాలా పార్టీలు మాతో పొత్తుకు చర్చలు జరుపుతున్నాయి. ఏఐఎస్‌‌ఎంకే పార్టీ మాతో కలిసింది. సీట్ షేరింగ్‌‌ విషయం తేలాక పొత్తు గురించి నిర్ణయం తీసుకుంటాం. మంచి మిత్రులు మాతో కలిసేందుకు ఉత్సాహం చూపడం శుభపరిణామం’ అని కమల్ చెప్పారు.