టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను నిలదీసిన మహిళలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను నిలదీసిన మహిళలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం భూదాకలన్ లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకి చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గ్రామశివారులోని పదెకరాల స్థలంలో మొక్కలు నాటేందుకు యత్నించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. 10 ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ హయాంలో ఇచ్చారని.. ఇప్పుడు మొక్కలు నాటడం ఏంటని ప్రశ్నించారు స్థానికులు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే చిన్నయ్య తమకు ఇళ్లు, జాగా ఇప్పిస్తాననని మోసం చేశారని ఆరోపించారు.