ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా, దుర్దాకీ కొండ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం వద్ద ఒక 12 బోర్ గన్, ఒక పిస్టల్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు అడవిని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎన్ కౌంటర్ తో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అడవిలో కూంబింగ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండిః