శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్ లోని అంశీపొరా ఏరియాలో టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారనే సమాచారం అందడంతో పోలీసులతో కలసి సెక్యూరిటీ ఫోర్సెస్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టామని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#ShopianEncounterUpdate: 02 #terrorists killed. #Incriminating materials including arms & ammunition recovered. Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/BOFVDRVrmf
— Kashmir Zone Police (@KashmirPolice) February 25, 2022
మరిన్ని వార్తల కోసం: