భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య

అల్వాల్ ,వెలుగు: చెరువులో పడి భర్త మృతి చెందడాన్ని తట్టుకోలేక భార్య సూసైడ్ చేసుకున్న ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇందిరానగర్​లో ఉంటున్న లక్ష్మి భర్త నెలరోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో పడి చనిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మి ఒంటరిగా ఉంటోంది. భర్త మరణాన్ని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఆమె బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో ఫ్యాన్ కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు.