కేసీఆర్ పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీలా ఉన్నయ్

కేసీఆర్ పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీలా ఉన్నయ్

సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు చేశారు బీజేపీ నేత విజయశాంతి. కేసీఆర్ పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్నారు.  పిచ్చి పర్యటనలు, మోసపు వాగ్దానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.కేసీఆర్ పర్యటనలు అరెస్టులు, వేధింపుల కోసమే అన్నటుగా ఉన్నాయన్నారు. ప్రజల్ని రోడ్లమీదకు రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. కేసీఆర్ జిల్లాలకు వస్తే ఇంత నిర్బంధం ఉంటుందంటే... దాని బదులు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు భావిస్తున్నారన్నారు. కేసీఆర్ కు హుజురాబాద్ పోయే ధైర్యం లేకనే పక్కనున్న సిద్ధిపేట ,వరంగల్ జిల్లా, యాదాద్రి జిల్లా పర్యటనలు చేస్తున్నారన్నారు. సీఎం పర్యటనల్లో కొందరు పోలీసు అధికారులు కనీసం ప్రతిపక్ష నాయకులనే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.