పల్లెల్లో మళ్లీ కరోనా టెన్షన్.. వెలుగుమట్లలో స్వచ్ఛంద లాక్డౌన్

పల్లెల్లో మళ్లీ కరోనా టెన్షన్.. వెలుగుమట్లలో స్వచ్ఛంద లాక్డౌన్

పల్లెల్లో మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్వచ్ఛందంగా గ్రామాల ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నారు. వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించారు. ఆగస్టు ఫస్ట్ తో లాక్ డౌన్ ని ఎత్తివేశారు.

కరోనా థర్డ్ వెవ్ భయంతో సెల్ఫ్ లాక్ డౌన్లతో కట్టడి చేస్తున్నాయి గ్రామాలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెలుగుమట్లలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. నిన్న కరోనాతో ఒకరు చనిపోయారు. గ్రామంలో ఇప్పటి వరకు 35 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో ఇవాల్టి నుంచి పదిహేను రోజుల పాటు లాక్ లాక్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. గ్రామంలో ప్రతి ఒక్కరు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. మాస్కు లేకుండా బయటకి రావొద్దని సూచించారు. రూల్స్ బ్రేక్ చేస్తే వేయ్యి రూపాయల ఫైన్ విధిస్తామని తెలిపారు.