న్యూఢిల్లీ: జ్యుడీషియరీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రిజర్వేషన్ కోసం మహిళలు డిమాండ్ చేయాలని, అది వాళ్ల హక్కు అని చెప్పారు. లా కాలేజీల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఉండాలన్నారు. బార్ కౌన్సిల్ఆఫ్ ఇండియా ఆదివారం సీజేఐ ఎన్వీ రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా లాయర్లను ఉద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘వెయ్యేండ్ల అణచివేత సమస్య ఇది. కింది కోర్టుల్లో 30 శాతం కన్నా తక్కువ మంది మహిళా జడ్జిలు ఉన్నారు. హైకోర్టుల్లో చాలా తక్కువగా 11.5 శాతమే ఉన్నారు. సుప్రీంకోర్టులోనూ 11 శాతమే ఉన్నారు’ అని చెప్పారు. చాలా కష్టపడి సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్యను11 శాతానికి తీసుకొచ్చామన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినప్పుడు జ్యుడీషియరీలో మహిళలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని అనుకుంటారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల వల్ల జ్యుడీషియరీలో ఎక్కువ మంది మహిళలు ఉండొచ్చని, కానీ ఇంకా ఎక్కువ మందికి వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళల్లో పై స్థాయి వరకు కొంత మందే వెళ్తున్నారని, వాళ్లూ చాలా సమస్యలను ఎదుర్కుంటున్నారని చెప్పారు. లాయర్ వృత్తిలో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులోని 33 మంది సిట్టింగ్ జడ్జిల్లో జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ బేలా ఎం త్రివేది మహిళా జడ్జిలు. జస్టిస్ నాగరత్న 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
జ్యుడీషియరీలో 50 శాతం కోటా మహిళలకు ఇవ్వాలె
- దేశం
- September 27, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..
- సీఎం జగన్ పై దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Krishna From Brindavanam: కృష్ణ ఫ్రమ్ బృందావనం.. కొత్త సినిమా ప్రకటించిన ఆది సాయికుమార్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- Telangana Tour : గొంతెమ్మ గుట్ట వెళ్లండి.. ఆహ్లాదం.. ఉల్లాసం.. ఉత్సాహం ఇస్తుంది..
- వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ .. ఎన్నికల్లో ఎలాంటి అనుమానాలు ఉండొద్దు: సుప్రీంకోర్టు
- Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. వికలాంగుల కోసం మొన్న ఇల్లు, నేడు బైక్స్
- తొలి రోజు నామినేషన్ వేసిన రఘునందన్ రావు, డీకే అరుణ
- Summer Tour : వేసవి కాలంలో ఈ టైమింగ్స్ లో జర్నీ చేయండి.. లేకపోతే వడదెబ్బ తగులుతుంది..!
- శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు జప్తు
Most Read News
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- నా కొడుక్కు ఏమైనా అయితే వెస్ట్ జోన్ డీసీపీదే బాధ్యత : షకీల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- నెరవేరనున్న దశాబ్దాల కల
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు