నిత్యం యోగాతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు

నిత్యం యోగాతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు
  • యోగా ఉత్సవ్ కు గవర్నర్ సహా కేంద్ర మంత్రులు హాజరు
  • ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా

హైదరాబాద్: నిత్యం యంగ్ గా ఉండాలంటే యోగా చేయాలన్నారు గవర్నర్ తమిళసై సౌందర రాజన్. ఫిట్ గా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. యోగాతో హైపర్ టెన్షన్ లాంటివి దూరం అవుతాయన్నారు. ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీ చొరవతో యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు కేంద్ర మంత్రి సోనోవాల్. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. యోగాతో జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచంలో ఉన్నా ఇస్లామిక్ దేశాలు సైతం యోగాను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జూన్ 21న ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఆస్తులను వదిలేసి ప్రజలపై బల్దియా ప్రతాపం

బర్త్​కు బదులు డెత్​ తప్పులతడకగా సర్టిఫికెట్ల జారీ

అనుమతి లేకుండా స్లాటర్ హౌస్

బండ్లగూడ చెరువుకు గండి