57 ఏళ్లు నిండిన వాళ్లు 31 లోపు అప్లై చేసుకోండి

57 ఏళ్లు నిండిన వాళ్లు 31 లోపు అప్లై చేసుకోండి

తగ్గించిన వయో పరిమితి ప్రకారం 57ఏళ్లు నిండిన వారు.. ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది సర్కార్. అర్హులైన వాళ్ళు ఈ నెల 31లోగా ఈ సేవ, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని.. కలెక్టర్లు, GHMC కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు నమూనాను కూడా విడుదల చేసింది సర్కార్. జీఓ 75 ప్రకారం పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఓటర్ కార్డుతో పాటు ఇతర పత్రాలను దరఖాస్తుతో పాటు జతపరచాలని చెప్పారు అధికారులు. ఈ సేవ, మీ సేవల్లో దరఖాస్తుల కోసం రుసుము తీసుకోవద్దని.. ప్రభుత్వమే ఆ రుసుము చెల్లిస్తుందని చెప్పింది సర్కార్.