
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం(Prasanna vadanam). కొత్త దర్శకుడు అర్జున్ వైకే(Arjun YK) తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించగా.. నందు, రాశీసింగ్, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న కీలక పాత్రలను పోషించారు. పేస్ బ్లైండ్ నెస్ అనే సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కొత్త కాన్సెప్ట్, టీజర్, ట్రైలర్ కూడా కొత్తగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. మొదటిషో నుండే పాజిటీవ్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అదే లెవల్లో కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మోస్తారు లాభాలు తెచ్చిపెట్టింది.
Without a Face, But Not Without Courage..?
— ahavideoin (@ahavideoIN) May 17, 2024
A Hero's Journey Beyond Sight!?
A gripping thriller-drama #PrasannaVadanamOnAha Premieres May 24th!
(24 hours early access for aha gold subscribers)@ahavideoIN @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/NG4CmDnW94
తాజాగా ప్రసన్నవదనం సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమాను మే 24 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో డీసెంట్ హిట్ గా నిలిచినా ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.