వరదల్లో బురద రాజకీయాలా?: అరికెపూడి గాంధీ

వరదల్లో బురద రాజకీయాలా?: అరికెపూడి గాంధీ

హైదరాబాద్: భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొందరు బురద రాజకీయాలు చేస్తున్నారని  ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘాటు విమర్శలు చేశారు. కూకట్​పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ లోని నీట మునిగిన సిక్కుల బస్తీలో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎడతెరపి లేని వర్షాలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కొందరు నాయకులు వచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చి, ఇష్టారీతిగా మాట్లాడుతున్నరు. వారంతా పొలిటికల్ టూరిస్టులే. ఆల్విన్ కాలనీ అభివృద్ధి కోసం సుమారు రూ.180 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి పనులు చేపట్టాం’ అని ఎమ్మెల్యే గాంధీ వెల్లడించారు.