మానకొండూరు TRS ఎమ్మెల్యే, ప్రజాగాయకులు రసమయి బాలకిషన్ కు మరో కీలక పదవి దక్కింది. రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా కల్పిస్తూ.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో...మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించే క్రమంలోనే రసమయికి కేబినేట్ హోదా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఇటీవల రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి కేటాయించి నెల రోజులు కూడా గడవక ముందే కేబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.