- ఫేక్ వెబ్ సైట్స్, కస్టమర్ కేర్ నంబర్లతో
- ఫ్రాడ్ చేసేందుకు సైబర్ నేరగాళ్ల స్కెచ్
హైదరాబాద్, వెలుగు: కరోనా టైమ్ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు స్కెచ్ వేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో జనం ఎక్కువగా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేసే అవకాశం ఉండటంతో.. సైబర్ నేరగాళ్లు దీన్నే టార్గెట్ చేస్తున్నారు. గూగుల్లో సెర్చ్ యాక్టివిటీ ప్రకారం స్పామ్ లింక్స్ పంపి సైబర్ ఫ్రాడ్స్ చేస్తారని పోలీసులు చెప్తున్నారు. ఆన్లైన్ అడ్డాగా ఫేక్ ఈ– కామర్స్ సైట్స్, కస్టమర్ కేర్ నంబర్స్, వెబ్ పోర్టల్స్ను పోలీసులు గుర్తించారు. ఇంటర్నెట్ మోసాలపై జనాలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు.
ఆన్లైన్ ఆర్డర్స్ టార్గెట్గా
కరోనా టైమ్లో జనం ఇండ్లలోనే ఉండి ఫుడ్, గ్రాసరీస్, మెడిసిన్, డ్రెసెస్ ఇలా ఎన్నో రకాల ఐటెమ్స్ను ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇలా ఆన్లైన్ షాపింగ్ను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఈ – కామర్స్ వెబ్సైట్ల పేరుతో ఫేక్ ఫ్లాట్ ఫామ్స్ తయారు చేసి అమాయాకులను ట్రాప్ చేస్తారు. చూడటానికి అసలైన వెబ్సైట్గా కనిపించినా.. వాటి వెనకాల సైబర్నేరగాళ్లు మాటువేసి ఉంటారని గుర్తించాలి. అందుకే ఆన్లైన్ షాపింగ్చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు వెబ్సైట్ ను క్రాస్ చెక్ చేసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. గూగుల్లో నెటిజన్లు వెతికే ప్రొడక్ట్ ను అన్నిటికన్నా ముందే కనిపించేలా చేస్తారు. దాన్ని క్లిక్ చేసినా, అందులోని నంబర్కు కాల్ చేసినా సైబర్ నేరగాళ్లు కాల్ బ్యాక్ చేస్తున్నారు. కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించి.. ఫోన్ లో ఆయా రకాల యాప్స్ ఇన్స్టాల్చేయించి అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారు. వాట్సాప్, మెసేజెస్లో వచ్చిన లింక్స్ను క్లిక్ చేయొద్దని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.